Tuesday, September 17, 2024

పాలమూరుకు పర్మిషన్ ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

సిడబ్ల్యుసికి ఇఎన్‌సి మురళీధర్ లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా ఆధారంగా చేపట్టిన పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిపిఆర్ పరిశీలనను వేగవంతం చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇఎన్‌సి మురళీధర్ శుక్రవారం కేంద్ర జల సంఘానికి లేఖ రాశారు. ఈ పథకానికి అవసరమైన అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఈ పథకానికి సం బంధించిన న్యాయపరమైన వివాదాలు తొలగిపోయాయని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సం బంధించిన ఆరు అనుమతులు మంజూరైన నేపథ్యంలో డిపిఆర్ పరిశీలిన వేగవంతం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుకు 45టిఎంసిలను కేటాయించిందని లేఖలో వెల్లడించారు. అయినప్పటికీ దానిని అభ్యంతరం చేస్తూ ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిందని, ఆ పిటిషన్‌ను ఈనెల 20వ తేదీన ట్రిబ్యునల్ కొట్టేసిందని తెలంగాణ ఇఎన్‌సి లేఖలో గుర్తుచేశారు. గతంలో పొందిన అనుమతుల వివరాలు, ఇటీవల ట్రిబ్యునల్ తీర్పు కాపీలను కూడా లేఖతో పాటు జత చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. మిగిలిన అనుమతులను త్వరితగతిన ఇవ్వాలని కోరుతూ
సుప్రీంకోర్టుకు ఎపి
పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటి కేటాయింపులపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకుంది. తెలంగాణ రాష్ట్రం లో దశాబ్ధాల తరబడి కరువు కోరల్లో చిక్కిన దక్షిణ తెలంగాణ ప్రాంతానికి తాగునీరు, సాగు నీరు అందజేయాలన్న లక్షంతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఈ పథకాన్ని చేపట్టింది. ప్రారంభ దశ నుంచే పనులు అడ్డుకునేందుకు ఏపి ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో వేసిన పిటిషన్లు ,చేసిన అభ్యంతరాలు ఫలించలేదు. హరిత ట్రిబ్యునల్ లేవనెత్తిన అన్ని సందేహాలను తెలంగాణ ప్రభుత్వం నివృత్తి చేసింది.

దీంతో హరిత ట్రిబ్యునల్ పాలమూరురంగారెడ్డి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నార్లపూర్ వద్ద ప్రారంభోత్సవం చేశారు. దీన్ని జీర్ణించుకోలేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎదో విధంగా అడ్డుకునే ప్రయత్నాలు సాగిస్తూనే వస్తోంది. పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90టిఎంసీల నీటికేటాయింపులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై విచారణ చేపట్టాలని కృష్ణ జల వివాదాల ట్రిబ్యునల్ (కెడబ్యూడిటి2)లో కూడా వాదించింది. అయితే ఆ జీవోపై విచారణ చేపట్టే అంశం తమ పరిధిలోకి రాదంటూ ఇంటర్ లోకేటిరీ అప్లికేషన్‌ను ట్రిబ్యునల్ తిరష్కరించింది. ఈ నేపధ్యంలో ఏపి ప్రభుత్వం మరో మారు ఇదే అంశంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News