Thursday, October 3, 2024

గాంధీభవన్ వద్ద 317 జీఓ బాధితుల నిరసన

- Advertisement -
- Advertisement -

గాంధీ భవన్ వద్ద 317 జీఓ బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన అభ్యర్ధులకు ఈ నెల 9వ తేదీన నియామక పత్రాలు కూడా అందజేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే 317 జీఓ బాధితులు ‘ఛలో గాంధీభవన్’ పేరుతో కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా బుధవారం నాంపల్లిలోని గాంధీభవన్ ఎదుట ఉపాధ్యాయులు, ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమ సమస్యలకు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో వారు ఆందోళన నిర్వహించారు.

సిఎం రేవంత్ రెడ్డి 317 జీఓను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు 317 జీఓను సమీక్షిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా తమ సమస్య పరిష్కరించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024 డిఎస్సీ అభ్యర్ధులు నియామకం అయిన తర్వాత తమను సర్ధుబాటు చేసేందుకు ఖాళీలు ఉండవని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వారి నియామకాలకు ముందే తమను స్థానికత ఆధారంగా జిల్లాలకు పంపించాలని ఉపాధ్యాయ, ఉద్యోగులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News