- Advertisement -
పసిడి పరుగులు ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. రోజురోజుకు బంగారం ధర పెరుగుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పుత్తడి ధరలకు రెక్కలు వచ్చాయి. వరుసగా రెండవ రోజు కూడా పెరిగిన ధరలతో బంగారం సామాన్యులకు షాక్ ఇస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడలో శుక్రవారం ధరలతో పోలిస్తే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 200 మేర పెరిగి రూ. 84007 స్థాయికి చేరింది. అటు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 మేర పెరిగింది. దీనితో ప్రస్తుతం పది గ్రాముల ధర రూ. 87770గా పలుకుతోంది. అయితే, పసిడి షాక్ ఇచ్చిన వేళ వెండి ధరలు కాస్త తగ్గి కిలో రూ. 107000గా ఉంది.
- Advertisement -