Tuesday, October 22, 2024

అంగన్‌వాడీలకు తీపికబురు

- Advertisement -
- Advertisement -

టీచర్లను పిఆర్‌సిలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం

మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లుల విడుదలకు ఆదేశాలు

ప్రభుత్వ నిర్ణయంతో 70వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు లబ్ధి

సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌లకు అంగన్‌వాడీ సంఘాల కృతజ్ఞతలు

మన తెలంగాణ/హైదరాబాద్: గత పక్షం రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్‌వాడీల కల నేరవేరింది. ఎట్టకేలకు ప్రభుత్వం వారితో చ ర్చలు జరిపి సమ్మెను విరమించేలా చేసింది. అదివారం అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభు త్వం తీపి కబురు అందించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీలో వారిని చేర్చాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సిఎం కెసిఆర్ నిర్ణయించా రు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను సైతం విడుదల చేయాలని సూచించా రు.

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయాలను మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలోని 70వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు లబ్ధి పొందనున్నారు. మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌తో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల డిమాండ్లపై మం త్రులు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్‌వాడీల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. మిగిలిన డిమాండ్లపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ తెలిపారు. కాగా, తమ డిమాండ్లపై ప్రభుత్వ సానుకూల వైఖరిపై అంగన్‌వాడీ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News