Thursday, February 20, 2025

ముస్లిం ఉద్యోగులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

ముస్లిం ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులు తమ పని వేళల కంటే గంట ముందే ఇళ్లకు వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. తమ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. మార్చి 2 నుంచి మార్చి 31 వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. ముస్లిం ఉద్యోగులు తమ విధుల నుండి సా.4 గంటలకే తమ ఇళ్లకు వెళ్లేలా అనుమతి కల్పించారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న ముస్లిం ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు, ప్రభుత్వ రంగం సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్పొరేషన్‌లలో పనిచేసే ఉద్యోగులందరికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని సిఎస్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News