Thursday, August 29, 2024

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే జాబ్ క్యాలెండర్: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రూప్1 ఫైనల్స్ కు 1:50కి బదులుగా 1:100 పద్ధతిని అనుసరించాలని కొందరు కోరుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నోటిఫికేషన్‌లో చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరిస్తే.. కోర్టులు వెంటనే ఆ ప్రక్రియను నిలిపేస్తాయంటూ పేర్కొన్నారు. దీంతో మళ్లీ గ్రూప్1 పరీక్షలు వాయిదా పడతాయని సిఎం రేవంత్ వివరించారు. డిఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరే వారిలో రాజకీయ నిరుద్యోగులు, కోచింగ్ సెంటర్ యజమానులే ఎక్కువగా ఉన్నారని సిఎం రేవంత్ విమర్శించారు. ఇటీవల దీనిపై దీక్ష చేసిన ముగ్గురిలో ఎవరూ పరీక్ష రాసే వారు లేరన్నారు.

త్వరలోనే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సిఎం రేవంత్ అన్నారు. మార్చి చివర్లో ఖాళీ వివరాలు తెప్పిస్తామని… జూన్ 2న నోటిఫికేషన్ ఇచ్చి.. డిసెంబర్ 9 నాటికి ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News