Sunday, September 8, 2024

యుపిలో పట్టాలు తప్పిన గూడ్సు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని అమ్రోహ సమీపంలో శనివారం ఒక గూడ్సు రైలుకు చెందిన ఏడు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఘజియాబాద్-మొరాదాబాద్ సెక్షన్‌లోని అమ్రోహి యార్డు వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు ఉత్తర రైల్వే సిపిఆర్‌ఓ తెలిపారు. ప్రత్యామ్నాయంగా మొరాదాబాద్-సహరన్‌పూర్-మీరట్-ఘజియాబాద్ రూట్‌లోకి రైళ్లను మళ్లించినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News