Tuesday, September 17, 2024

గగనతలంలో గవర్నర్ హరిబాబుకు తీవ్ర అస్వస్థత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు అనారోగ్యానికి గురికావడంతో ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు వస్తుండగా గగన తలంలో తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. వెంటనే విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇవ్వడంతో శంషాబాద్ నుంచి నానక్‌రామ్ గూడ వరకు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 11.15 నిమిషాలకు హైదరాబాద్ చేరుకున్న హరిబాబు 30 నిమిషాల్లో స్టార్ ఆస్పత్రికి తరలించారు. హరిబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆస్పత్రికి వెళ్లి హరిబాబును పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను వెంకయ్య అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News