- Advertisement -
అమరావతి: వైసిపి హయాంలో వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేశారని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ప.గో.. పాలకొల్లులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నిమ్మల పాల్గొన్నారు. గవర పేటలో రూ. 1.70 కోట్లతో పంటకాల్వపై వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శివదేవుని చిక్కాలలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. గతంలో రైస్ మిల్లుల దగ్గర రైతులు పడిగాపులు పడే దుస్థితి ఏర్పడిందని అన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో రైతులకు ఎగ్గొట్టిన.. రూ. 1,654 కోట్ల ధాన్యం బకాయిలను చంద్రబాబు చెల్లించారని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
- Advertisement -