Thursday, September 19, 2024

గోదావరిలో పడి గ్రామపంచాయతీ ఉద్యోగి మృతి

- Advertisement -
- Advertisement -

నీటి విడుదల కోసం వెళ్లిన బాసర గ్రామానికి చెందిన అశోక్ (35) గోదావరి నదిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు ఎస్సై గణేష్ తెలిపారు. బాసర గ్రామపంచాయతీలో అశోక్ వాటర్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. అయినా ఆచూకి దొరకలేదు. గురువారం మధ్యాహ్నం గోదావరి నదిలో శవమై కనిపించాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నీటి విడుదల కోసం వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News