Tuesday, April 8, 2025

గ్రీన్ ఎనర్జీ , రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ పునర్జీవనం, విద్య అభివృద్ధికి

- Advertisement -
- Advertisement -

సంబంధించి సింగపూర్ సంస్థలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాం
కొత్త గ్రీన్ పవర్ పాలసీలో భాగంగా సోలార్, హైడ్రో, పంపుడ్ స్టోరేజీ విభాగాలపై దృష్టి పెట్టా
సింగపూర్ ప్రతినిధి బృందంతో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సమావేశం

మనతెలంగాణ/హైదరాబాద్:  సోలార్ పవర్, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ పునర్జీవం, విద్య తదితర అంశాలు ప్రభుత్వ ప్రాధాన్యతలని సింగపూర్ ప్రతినిధి బృందంతో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందంతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సింగపూర్ కాన్సల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ మాట్లాడుతూ తెలంగాణతో ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని ఈ విషయంలో డిప్యూటీ సిఎం సహకారం, సందేశం కావాలంటూ పాంగ్ కోరారు. గ్రీన్ ఎనర్జీ , రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ పునర్జీవనం, విద్య తమ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలని ఈ రంగాల్లో సింగపూర్ సంస్థలతో కలిసి పని చేసే అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని డిప్యూటీ సిఎం తెలిపారు.

కొత్త గ్రీన్ పవర్ పాలసీలో భాగంగా సోలార్, హైడ్రో, పంపుడ్ స్టోరేజీ విభాగాలపై దృష్టి పెట్టినట్టు డిప్యూటీ సిఎం తెలిపారు. ఇంటర్నేషనల్ స్టాండరడ్స్‌తో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్టు సింగపూర్ ప్రతినిధి బృందానికి ఆయన వివరించారు. మొదటి దశలో నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేశామని, ప్రతి పాఠశాలను 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు ఇది రాష్ట్ర ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్టు అని డిప్యూటీ సిఎం భట్టి వివరించారు. తెలంగాణలో అధికంగా పట్టణాలు ఉన్నాయని, పట్టణాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సింగపూర్ పొలిటికల్ కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్, సింగపూర్ హై కమిషన్ ప్రథమ ఆర్థిక సెక్రటరీ, డిప్యూటీ సిఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News