- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం జరిగిన గ్రూప్-1 మొయిన్స్ ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. గ్రూప్-1లో మొత్తం 21,093 మంది ఈ పరీక్షలు రాశారు. గత ఏడాది అక్టోబర్లో ఈ పరీక్షలు జరిగాయి. అభ్యర్థులు టిజిపిఎస్సి వెబ్సైట్లో తమ ఫలితాలను చూసుకోవచ్చని వెల్లడించారు. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను బట్టి టీజీపీఎస్సీ గ్రూప్-1 తుది నియామకాలను ప్రారంభించనుంది. అభ్యర్థులకు రీ కౌంటింగ్ ఆప్షన్లు కూడా స్వీకరించి ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత 1:2 నిష్పత్తిలో తుది జాబితా వెల్లడించనున్నారు.
- Advertisement -