Saturday, July 6, 2024

తవ్వే కొద్దీ అక్రమాలు!

- Advertisement -
- Advertisement -

జిఎస్‌టి రిఫండ్ కుంభకోణంలో అధికారుల లీలలు డిప్యూటీ
కమిషనర్ నుంచి కిందిస్థాయి వరకు పంపకాలు మరికొంతమందిని విచారించనున్న
అధికారులు చట్టంలోని లోటుపాట్ల్లను ఆసరాగా చేసుకొని అక్రమాలకు బీజం ఎలక్ట్రిక్ వాహనాలకు
బోగస్ ఇన్‌వాయిస్‌లతో దందా రూ.40కోట్ల అవినీతికి సంబంధించి ఇప్పటికే కేసులు నమోదు

మన తెలంగాణ/హైదరాబాద్ : జిఎస్‌టి రీఫండ్ కుంభకోణంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగులో కి వస్తున్నాయి. ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖ ఇచ్చిన ఫిర్యాదుపై ఆ శాఖకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు మరింత లో తుగా దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు రూ. 40 కో ట్ల రూపాయల రీఫండ్‌లకు చెందిన అరెస్టులు జ రిగినప్పటికీ మరికొన్ని రీఫండ్లపై శాఖాపరంగా, పోలీసులతో పాటు వాణిజ్యపన్నుల శాఖ అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు. ఈ కుం భకోణంలో డిప్యూటీ కమిషనర్ నుంచి కిందిస్థా యి వరకు పంపకాలు జరిగినట్లుగా తెలిసింది.

గత ప్రభుత్వ హయాంలో ఎలక్ట్రికల్ వాహనాల విక్రయాల నిమిత్తం పలు షోరూంల నిర్వహణ కోసం వాణిజ్య పన్నులశాఖ డీలర్లకు జీఎస్టీ లైసెన్స్‌లు ఇచ్చింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు చేయకుండానే చేసినట్లు బోగస్ ఇన్‌వాయిస్‌లను సృష్టించి జీఎస్టీ వెబ్‌పోర్టల్లో అధికారులు వాటిని అప్‌లోడ్ చేశారు. రీఫండ్ తీసుకొని ప్రభుత్వ సొమ్మును అధికారులతోకు మ్మక్కై కొం దరు అక్రమార్కులు నొక్కేశారు. 20 22 జూలై నుంచి 2023 నవంబర్ వరకు జరిగిన ఈ రీఫండ్‌ల కుంభకోణాన్ని వాణిజ్య పన్ను ల శాఖ కమిషనర్ శ్రీదేవి వెలుగులోకి తీసుకొచ్చారు.

నలుగురి సహకారంతోనే…

జిఎస్‌టి చట్టంలోని వెసులుబాటును ఆసరా చేసుకుని అంతర్రాష్ట్ర ట్యాక్స్ కన్సల్టెంట్‌ల సహకారంతో ఈ అక్రమార్కులు ఈ అవినీతికి బీజం వే శారు. దీంతో అక్రమార్కుల నుంచి అందినకాడికి కమీషన్లు దండుకొని డిప్యూటీ కమిషనర్ నుంచి కిందస్థాయి డిసిటిఓ వరకు పంపకాలు జరిగినట్లుగా ఆ శాఖ ఉన్నతాధికారులు సైతం గుర్తించా రు. ప్రాథమిక అంచనా మేరకు నలుగురు వా ణిజ్య పన్నుల శాఖ అధికారుల సహకారంతో వ్యాపారం చేయకుండానే చేసినట్లు చూపెట్టినట్టు ఆ శాఖ ఉన్నతాధికారుల విచారణతో తేలింది. ప్రస్తుతం మరిన్ని విషయాలు కూడా అధికారుల విచారణలో వెలుగుచూస్తున్నట్టుగా సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎ త్తున విక్రయించేందుకు రాయితీలను కల్పించిం ది.ఎలక్ట్రిక్ వాహనాల విలువపై కేవలం 5% మా త్రమే జీఎస్టీ వేస్తుంది. కానీ, ద్విచక్రవాహనా ల విడిభాగాల కొనుగోలుపై 18శాతం జి ఎస్‌టి వ సూలు చేస్తోంది.

దీంతోఎలక్ట్రిక్ బైకుల విక్రయాలపై వచ్చిన 5శాతం జీఎస్టీని మినహాయించి మరో 13శాతం జీఎస్టీ రీఫండ్ ఇవ్వాల్సి ఉంది. కానీ, చాలా మంది అధికారులు రీఫండ్ దరఖాస్తులను పరిశీలన చేయకుండానే ఇచ్చారని ప్రస్తుతం ఆ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. మరికొందరు అధికారులు బోగస్ ఇన్‌వాయిస్‌లని తెలిసినా రీఫండ్‌లు ఇచ్చినట్లుగా అధికారుల విచారణలో తేలింది.

మరికొంతమంది అధికారులను విచారణ చేయాలని….ఇప్పటి వరకు రూ.40 కోట్ల రూపాయలు రీఫండ్లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. బోగస్ సంస్థలకు రిజిస్ట్రేషన్ ఇచ్చిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని పోలీసు శాఖ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొంటున్న అధికారులు కాకుండా మరికొందరు కూడా ఈ రీఫండ్‌లు ఇచ్చిన అధికారులు ఉండడంతో వారిని కూడా విచారణ చేయాలని సిసిఎస్ అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News