Saturday, April 26, 2025

బట్లర్ మెరుపు అర్థ శతకం.. ఆర్సిబిపై గుజరాత్ విజయం..

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2025లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ జట్టుపై గుజరాత్ గెలుపొందింది. ఆర్సీబీ జట్టు విధించిన 170 పరుగుల లక్ష్యాన్ని.. గుజరాత్ 17.5 ఓవర్లలోనే ఛేదించింది. జోస్ బట్లర్(73) మెరుపు అర్థ శతకంతో చెలరేగి ఆడారు. బట్లతో పాటు ఓపెనర్ సాయి సుదర్శన్(49),  రూతర్డ్ ఫర్డ్(30) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు.

అంతకుముందు.. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆర్సీబి బ్యాటర్లలో లివింగ్‌ స్టోన్‌(54), జితేశ్ శర్మ(33), టిమ్ డేవిడ్(32)లు రాణించారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News