Thursday, April 24, 2025

దేవరకరుణాకర్ మృతి పట్ల మంత్రి తలసాని సంతాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. కరుణాకర్ మరణించిన వార్త తెలుసుకున్న మంత్రి గుడిమల్కాపూర్ లోని వారి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సౌమ్యుడు, అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే కరుణాకర్ మరణం చాలా బాధాకరం అని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News