- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నారా కోడూరు-బుడంపాడు గ్రామాల మధ్య మహిళలు ప్రయాణిస్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం జిజిహెచ్ కు తరలించారు.
- Advertisement -