Sunday, June 30, 2024

సిఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై హరీష్‌రావు ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో సిఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్, బిజెపి కుమ్మక్కు అయ్యాయని సిఎం రేవంత్ ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరం అని కొట్టిపారేశారు. మెదక్‌లో బిజెపిని బిఆర్‌ఎస్ పార్టీయే గెలిపించిందని సిఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో మూడు చోట్ల బిఆర్‌ఎస్ మెజారిటీ సాధించిందని గుర్తు చేశారు. ‘రఘునందన్ రావు సొంత నియోజక వర్గం దుబ్బాకలో కూడా బిఆర్‌ఎస్ మెజారిటీ సాధించింది. రేవంత్ సొంత గ్రామం కొండారెడ్డి పల్లిలో బిజెపికి మెజారిటీ వచ్చింది. రేవంతే అక్కడ బిజెపికి కాంగ్రెస్ ఓట్లు మళ్లించారా? రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన మహబూబ్ నగర్‌లో బిజెపి ఎలా గెలిచింది. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎంఎల్‌ఎలున్నారు.

వారంతా కలిసి బిజెపిని గెలిపించారా? కొడంగల్‌లో రేవంత్ 32 వేల మెజారిటీతో గెలిచారు. పార్లమెంటు ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 21 వేల మెజారిటీ మాత్రమే వచ్చింది. మిగతా ఓట్లను రేవంత్ బిజెపికి వేయించారా? రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మల్కాజిగిరిలో బిజెపి భారీ మెజారిటీతో ఎలా గెలిచింది. ఈ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ బిజెపిని గెలిపించిందా? బిజెపి పంచన చేరింది, మోడీ శరణు చొచ్చింది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఉండి బిజెపి ఎజెండా అమలు చేస్తున్నది రేవంత్ రెడ్డి. నిండు సభలో మోడీని పెద్దన్న అని సంబోధించింది రేవంత్ రెడ్డి. మోడీ, రేవంత్ రెడ్డి కుమ్మక్కై సింగరేణని ప్రైవేటు పరం చేస్తున్నారు. విభజన హామీలపై రేవంత్ రెడ్డి మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం లేదు. రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ శక్తి అయిన బిఆర్‌ఎస్‌ను టార్గెట్ చేశాయి. బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్కటయ్యాయని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటు” అని హరీశ్ రావు విమర్శలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News