Sunday, September 8, 2024

మూడు నెలల నుంచి జీతాల్లేవ్:హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని, తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర 78 విభాగాలలో పనిచేస్తున్న 17,541 మంది వైద్యులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులు, అకౌంటెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేట ర్లు, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు తదితరులు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు నెదుర్కొంటున్నారన్నారు.

ప్రజల ఆరోగ్యాలను సంరక్షించేందుకు నిరంతరం కృషి చేసే వైద్య సిబ్బందికి నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడం ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోం దన్నారు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు డొల్ల అని చెప్పడానికి ఇది మరో నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, మూడు నెలల పెండింగ్ జీతంతో పాటు, పిఆర్‌సి బకాయిలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News