Wednesday, October 16, 2024

హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సాయిబాబా: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: సాయబాబా భౌతికకాయానికి మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కోదండరామ్‌ లు నివాళులర్పించారు. సోమవారం  ఉదయం మౌలాలిలోని ఆయన నివాసానికి వెళ్లిన హరీశ్ రావు నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతర ఆయన మాట్లాడుతూ.. జైలు నుంచి వచ్చిన కొన్నాళ్లకే సాయిబాబా మరణించడం బాధాకరమని చెప్పారు. “సమాజంలో మార్పు, హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సాయిబాబా. హక్కుల కోసం పోరాడేవారిపై అక్రమ కేసులు పెట్టడం బాధాకరం” అని అన్నారు. సాయిబాబాపై కేంద్రం అణచివేత ధోరణితో వ్యవహరించిందని ఎమ్మెల్సీ కోదండరామ్‌ అన్నారు. సాయిబాబా మృతికి కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News