Tuesday, September 17, 2024

పాక్షిక రుణమాఫీయే… పూర్తిగా ఎక్కడ చేశారు? : హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

రేవంత్ రెడ్డిని మళ్లీ ప్రశ్నించిన హరీశ్ రావు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తన చరిత్ర తెలుసునని… అలాగే సిఎం రేవంత్ రెడ్డి చరిత్ర కూడా తెలుసునని సిద్దిపేట ఎంఎల్ఏ హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  రైతు రుణమాఫీ పాక్షికంగా చేశామని ప్రభుత్వం చెబితే అంగీకరిస్తామని, కానీ పూర్తిగా చేశామంటే ఒప్పుకునేది లేదన్నారు. రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత రూ.17 వేల కోట్ల మేరకే చేసిందన్నారు.

రైతులకు రూ.14 వేల కోట్లు కోత పెట్టారని విమర్శించారు. రుణమాఫీ పూర్తిగా చేయకుండానే తనను రాజీనామా చేయమని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. క్షమాపణ చెప్పాల్సింది, రాజీనామా చేయాల్సింది తాను కాదని… పాక్షిక రుణమాఫీ చేసినందుకు సిఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ‘రుణమాఫీ విషయంలో నేరుగా రైతుల వద్దకే వెళ్లి అడుగుదామా?’ అని ప్రశ్నించారు.

పాక్షిక రుణమాఫీ చేసి తనను రాజీనామా చేయమని అడగడం ఏమిటన్నారు. ‘అసలు కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని మాట తప్పిందెవరు?’ అని ప్రశ్నించారు. రుణమాఫీ సహా ఆరు గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేస్తే రాజీనామా చేస్తానని చెప్పానని… కానీ ఏదీ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News