Tuesday, September 17, 2024

9 నెలల రేవంత్‌రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ ధ్వంసమైంది: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలో విద్య లేకపోవడం శోచనీయమని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన గురుపూజోత్సవానికి హాజరయ్యే తీరిక లేదా..? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. విద్యాశాఖ పట్ల సిఎం చిత్తశుద్ధికి, ప్రాధాన్యతకు ఇది మరో నిదర్శనమని వ్యాఖ్యానించారు. 9 నెలల రేవంత్‌రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ ధ్వంసమైందని పేర్కొన్నారు. టీచర్లు లేక పాఠశాలలు మూసేస్తున్నారని, పురుగుల అన్నం, గొడ్డుకారం తినలేక విద్యార్థులు ఏడుస్తున్నారని, ఫుడ్ పాయిజన్, పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లతో రోదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గురుకులాల ఖ్యాతిని రోజు రోజుకి దిగజార్చుతున్నారని మండిపడ్డారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారని, తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నారని అన్నారు. తమ పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఉన్న విద్యా వ్యవస్థను సక్రమంగా నిర్వహించరు కానీ సమీకృత గురుకులాలు, విద్యా కమిషన్ అంటూ భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. మీ నాయకత్వంలో పతనమవుతున్న విద్యా వ్యవస్థ గురించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఏం సమాధానం చెబుతారు రేవంత్ రెడ్డి..? అని హరీశ్‌రావు అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News