Sunday, September 8, 2024

రుణమాఫీలో కోతలు పెట్టేందుకే ఆ నిబంధనలు: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పంటల రుణమాఫీకి రేషన్‌కార్డు, పిఎం కిసాన్ నిబంధన అమలు చేస్తున్నారని, ఈ నిబంధనల వల్ల చాలా మంది రైతులకు రుణమాఫీ కావట్లేదని మాజీ మంత్రి, సిద్ధిపేట బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం కనబర్చారు. హైదరాబాద్‌లో ఆయన మీడి యాతో చిట్ చాట్ చేశారు. రుణమాఫీలో కోతలు పెట్టేందుకే రేషన్‌కార్డు, పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక విభాగాల వైద్యులను జిల్లాలకు బదిలీ చేశారన్నారు. అనుభవం ఉన్న వైద్యులను చిన్న ఆసుపత్రులకు బదిలీ చేశారని తెలిపారు.

ప్రస్తుత విభాగాల్లోనే సూపర్ స్పెషాలిటీ నిపుణులను కొనసాగించాలన్నారు. ఉద్యోగులకు డిఎలు ఇస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. ప్రతిపక్షం ఇస్తున్న సూచ నలను ప్రభుత్వం పాటించాలన్నారు. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను సమర్థించను అని స్పష్టపర్చారు. వృద్ధాప్య పెన్షన్లు సమయానికి రావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నిరుద్యోగులపై లాఠీలు ఝళి పుస్తున్నారన్నారు. పోలీసు శాఖలో డీజిల్‌కు డబ్బులు ఇవ్వడంలేదని, హోంగార్డులకు జీతాల్లేవని, కల్యాణలక్ష్మీ పథకం ఆగిపోయిందని, లక్ష మంది కి పైగా చెక్కుల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. రైతుబీమా చెక్కులకు కనీసం మూడు నెలల సమయం పడుతోందని వెల్లడించారు.

గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదు…
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్రం నుంచి రూ.500 కోట్లు వచ్చినా విడుదల చేయట్లేదన్నారు. గ్రామ పంచాయతీల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. సర్పంచ్‌లు ఆగమయ్యాం అని తనకు వినతిపత్రం ఇస్తున్నారని వెల్లడించారు. ప్రతిపక్షం తట్టిలేపితే కానీ ఈ ప్రభుత్వానికి సోయి లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం గ్రామ పంచాయతీల ట్రాక్టర్లకు డీజిల్ కూడా పోయట్లేదని అన్నారు. ఉపాధి హామీ నిధులు కేంద్రం రూ. 850 కోట్లు నిధులు విడుదల చేసింది.. రూ. 350 కోట్ల గ్రాంట్లు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇవ్వాలి అవి విడుదల చేయడం లేదని హరీష్ రావు పేర్కొన్నారు. చాలా చోట్ల బిల్లులు రాలేదని స్కూళ్లలో బాత్రూంలు ఓపెన్ చేయట్లేదని వెల్లడించారు. సర్పంచ్ ఎన్నికలు పెట్టకపోవడంతో చాలా నిధులు ఆగిపోతున్నాయని పేర్కొన్నారు.

ఈ సమస్యపై అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని.. తాను లేవగానే 8 మంది మంత్రులు లేచి అడ్డుకుంటున్నారని హరీష్ రావు చెప్పారు. గతంలో జీఎచ్‌ఎంసీ కార్పొరేటర్‌lకు నెలకు నలభై లక్షల ఫండ్స్ ఇచ్చే వాళ్ళమన్నారు. ఇప్పుడు ఒక్క పైసా కార్పొరేటర్ ఇవ్వట్లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీహార్ ఆఫీసర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని గగ్గోలు పెట్టారు.. మరి ఇప్పుడు తెలంగాణ నుంచి ఉన్న సివి ఆనంద్, శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, శివదర్ రెడ్డిలకు అర్హత ఉన్నా వాళ్ళను ఎందుకు డిజిపి చేయలేదని ప్రశ్నించారు. గతంలో డిజిపిగా ఉన్న మహేందర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసి ఇప్పుడు అందలం ఎక్కించారని దుయ్యబట్టారు. ఇకపోతే కెసిఆర్ అసెంబ్లీకి హాజరు అయ్యే విషయంలో తమకు ఒక స్ట్రాటజీ ఉంది.. హాజరు అవుతారో లేదో ఇప్పుడే చెప్పమని హరీష్ రావు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News