- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎపికి చెందిన బస్సు ఢీకొనడంతో ఎసిపి నందీశ్వర బాబ్జీ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శనివారం తెల్లవారుజామున ఉదయం 04.40 గంటలకు డిసిపి నందీశ్వర బాబ్జీ అనే వ్యక్తి వాకింగ్కు వెళ్లి హనుమాన్ దేవాలయం సమీపంలోని లక్ష్మారెడ్డి పల్లె వద్ద రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూజివీడు డిపోకు చెందిన డ్రైవర్ బస్సు నంబర్ గల ఎపి39 విఎ 9563లో అబ్దుల్లాపూర్ మెట్ లో అతివేగంతో వెళ్తున్నాడు. ఎసిపి నందీశ్వర బాబ్జీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
- Advertisement -