Sunday, February 23, 2025

వరద గుప్పిట్లో ఇందూరు.. స్తంభించిపోయిన జనజీవనం

- Advertisement -
- Advertisement -

పెద్దేముల్: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ముసురు వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. పెద్దేముల్ మండలంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలోని ఇందూరు గ్రామంలోకి భారీగా వరద నీరు చేరుతుంది. చెరువును తలపించేలా వరదనీరు ఇళ్లల్లోకి చేరుతుంది.

దీంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. గతేడాది కూడా ఇదే పరిస్థితి నెలకొందని, ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుందని గ్రామస్థులు వాపోయారు. హరిజనవాడలో పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరుకు చెక్ పెట్టేందుకు అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News