- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం నైరుతి బంగాళఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం 1.5 కి.మీ ఎత్తులో కొనసాగిన ఉపరిత చక్రవాత ఆవర్తనం ఇవాళ బలహీన పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, మరికొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక వచ్చే మూడు రోజుల్లో అక్కడకక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
- Advertisement -