Saturday, February 22, 2025

ఉత్తర కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం గురువారం సాయంత్రం భూ ఉపరితలం వైపు మళ్లే అవకాశం ఉందని, ఎపిలో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. దక్షిణ కోస్తా జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, శ్రీకాకుళం, అల్లూరి, పార్వతీపురం, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, విజయనగరం, అనకాపల్లి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

Also Read: విమానం గాల్లో… బాత్రూమ్ లో శృంగారం…. వీడియో వైరల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News