Wednesday, July 3, 2024

ఉత్తరభారతంలో భారీ వర్షాలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ , గువాహటి: ఉత్తర భారతంలో శనివారం పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. రానున్న నాలుగైదు రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. వరస వర్షాలతో జలమయమైన ఢిల్లీ నగరంలో శుక్రవారం ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం నమైదైన మరో ఆరు మరణాలతో రెండు రోజుల్లో మృతుల సంఖ్య 11కు చేరింది.

తాజాగా బాదలీ ప్రాంత అండర్‌పాస్ వద్ద నిలిచిన నీటమునిగి ఇద్దరు బాలురు మృతి చెందగా, వోఖలా అండర్‌పాస్ నీటిలో స్కూటీతో చిక్కుకుపోయి దిగ్విజయ్ కుమార్ చౌదరీ (60) అనే వ్యక్తి మృతి చెందినట్టు పోలీస్‌లు తెలిపారు. ముందురోజు వసంత్‌విహార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి దాని కింద చిక్కుకుపోయిన ముగ్గురు కార్మికుల మృతదేహాలను శనివారం వెలికి తీశారు. ఢిల్లీ నగరానికి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికను జారీ చేసింది.

హిమాచల్ ప్రదేశ్ లోనూ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శనివారం కురిసిన భారీ వర్షాలకు కాంగ్డా, కులు, సోలన్ జిల్లాల్లో రహదారులను మూసివేశారు. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ వద్ద సూఖీ నదిలో పలు కార్లు కొట్టుకుపోయాయి. అస్సాంలో వరదల పరిస్థితి శనివారం మరింత దారుణంగా మారింది. 7 రాష్ట్రాల్లోని 1.33 లక్షల మంది వరదలతో సతమతం అవుతున్నట్టు అధికారులు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News