Sunday, February 23, 2025

హీరో అజిత్ క్షేమం!

- Advertisement -
- Advertisement -

ప్రముఖ తమిళ హీరో అజిత్ ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అజిత్ గురువారంనాడు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఏ కారణంతో ఆయన ఆస్పత్రిలో చేరారో తెలియకపోవడంతో ఆయన అభిమానులు కంగారుపడ్డారు. షూటింగ్ లో అజిత్ గాయపడ్డారని, ఆయన ఆరోగ్యం బాగోలేదని వదంతులు చెలరేగాయి. అయితే దీనిపై అజిత్ సన్నిహితవర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఆరోగ్య పరీక్షల నిమిత్తమే ఆస్పత్రిలో చేరారని, అభిమానులు కంగారు పడాల్సిన పనేమీ లేదని స్పష్టం చేశాయి.

అజిత్ ప్రస్తుతం విదా ముయరాచి అనే యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ లో భాగంగా ఆయన త్వరలో అజర్ బైజాన్ కు వెళ్లనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News