Monday, July 8, 2024

ఇజ్రాయెల్ పైకి 200 రాకెట్లు

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్ , లెబనాన్ లోని హెజ్‌బొల్లాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గ్రూప్ సీనియర్ కమాండర్ మహమ్మద్ నామేహ్ నజీర్‌ను ఓ వైమానికి దాడిలో ఇజ్రాయెల్ హతమార్చిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఆ దేశ సైనిక స్థావరాలే లక్షంగా 200 కు పైగా రాకెట్లు, 20 కి పైగా ఆత్మాహుతి డ్రోన్లు ప్రయోగించినట్టు హెజ్‌బొల్లా ప్రకటించింది. గాజాలో పోరు ప్రారంభమైన తరువాత ఈ గ్రూపు జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇదీ ఒకటి.

లెబనాన్ భూభాగం నుంచి కొన్ని రాకెట్లు ఇజ్రాయెల్ లోకి ప్రవేశించాయని, చాలా వాటిని కూల్చేసినట్టు టెల్ అవీవ్ తెలిపింది. హెజ్‌బొల్లా దాడుల తరువాత ఇజ్రాయెల్ సైన్యం కూడా దక్షిణ లెబనాన్ ప్రాంతంపై విరుచుకుపడింది. రామ్యెహ్, హూలా పట్టణాల్లోని ఆ గ్రూపు మిలిటరీ నిర్మాణాలపై పెద్ద ఎత్తున దాడులు జరిపినట్టు వెల్లడించింది. హులా పై జరిపిన దాడిలో ఒకరు మృతి చెందినట్టు లెబనాన్ వార్తా సంస్థ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News