Sunday, September 22, 2024

మంత్రి కెటిఆర్ కుమారుడు హిమాన్షుకి డయానా అవార్డు

- Advertisement -
- Advertisement -

మానవీయ ధృక్పథంతో చేసిన సామాజిక సేవకు పురస్కారం
తన తాత, సిఎం కెసిఆర్‌కు హిమాన్షు ధన్యవాదాలు

Himanshu rao bags diana award

మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రి కెటిఆర్ కుమారుడు హిమాన్షుకి డయానా అవార్డు దక్కింది. తొమ్మిది సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉ న్న వారికి ఇచ్చే అవార్డు ఈ సారి హిమాన్షు రావుకి దక్కింది. సమాజంలో మార్పు కోసం మానవీయ దృక్ఫథంతో చేసే పనులకి ఈ అవా ర్డు ఇస్తారు. దివంగత బ్రిటన్ రాజకుమారి డయానా పేరు మీద ఈ అవార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిటన్ కేంద్రంగా ఈ అ వార్డును ప్రదానం చేసే సంస్థ ప్రపంచవ్యాప్తం గా యువకులు చేసే సోషల్ వర్క్‌ని ఈ అవార్డు కోసం పరిగణనలోనికి తీసుకుంటుంది. హి మాన్షు గ్రామాల్లో స్వయం సమృద్ధి దిశగా చేపట్టాల్సిన పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని స్వయంగా శోమ పేరుతో ఒక ప్రాజె క్ట్ ప్రారంభించారు.

గజ్వేల్ నియోజకవర్గంలో గంగాపూర్, యూసుఫ్ ఖాన్‌పల్లి గ్రామాల్లో పలు కార్యక్రమాలను చేపట్టారు. ఈ ప్రాజెక్టు కోసం తనకు సంపూర్ణ మార్గదర్శనం చేసిన తన తాత, సిఎం కెసిఆర్‌కి హిమాన్షు ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు తనకున్న ఆలోచనల మేరకు చేపట్టిన ఈ ప్రాజెక్టుకి సహకరించిన రెండు గ్రామాల ప్రజలకు, తన మెం టార్స్‌కి ఈ సందర్భంగా హిమాన్షుకృతజ్ఞతలు తెలిపారు. అవార్డు వచ్చిన సందర్భంగా హి మాన్షుకు ఆయన మిత్రులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. 15 సం॥రాల వయసులోనే మానవీయ దృక్ఫథంతో గ్రామాల్లో మా ర్పుకు చేపట్టిన కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందడం గొప్ప విషయమని పలువురు అభినందించారు. తండ్రిగా తనకేంతో గర్వకారణంగా ఉందన్న మంత్రి కెటిఆర్ హిమాన్షుకుఅభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News