Sunday, September 8, 2024

కేంద్ర మైనారిటీశాఖ మంత్రిని కలిసిన హోంమంత్రి మహమూద్ ఆలీ

- Advertisement -
- Advertisement -

Home Minister Mahmood Ali meets Union Minority Affairs Minister

వక్ఫ్ బోర్డు ఆస్తులు, ప్రస్తుత పరిస్థితులపై చర్చ

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ శుక్రవారం నాడు ఢిల్లీలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని కలిశారు. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైనారిటీ పథకాలు,వక్ఫ్ బోర్డు ఆస్తులు, వాటి ప్రస్తుత పరిస్థితి గురించి చర్చించారు. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డును బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులను అందించాలని అభ్యర్థించారు. తెలంగాణ వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి త్వరలో నిధులను విడుదల చేస్తామని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాష్ట్ర హోం మంత్రి ముహమ్మద్ మహమూద్ అలీకి హామీ ఇచ్చారు. అంతకుముందు, హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, హజ్రత్ ఖవాజా నిజాముద్దీన్ లియా, హజ్రత్ కుతుబుద్దీన్ భక్తియార్ కాకి, హజ్రత్ నసీరుద్దీన్ చిరాగ్ మసీదులకు హాజరైనప్పుడు ఫతేహా చదివి ప్రార్థనలు చేశారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కుటుంబం యొక్క దీర్ఘాయుష్షు, తెలంగాణ ప్రజల సంక్షేమం, ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న టిఆర్‌ఎస్ భవన్ అద్భుతమైన నిర్మాణం కోసం ఆయన ప్రార్థించారు. హోం మంత్రి వెంట సీనియర్ టీఆర్‌ఎస్ నాయకులు షరీఫుద్దీన్, మునీర్ అహ్మద్, అబ్దుల్ బాసిత్, ఫరీదుద్దీన్, మునావర్ ఖాన్, మహమ్మద్ ఇర్ఫాన్ తదితరులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News