Thursday, April 24, 2025

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి జనసేన చేయూత

- Advertisement -
- Advertisement -

అశ్వారావుపేటః మండల పరిధిలోని గుర్రాల చెరువు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్కూట్ ఏర్పడి సంకుల సత్యం అనే గొర్రెల కాపరి పూరి గుడిసె దగ్దం కాగా, సర్వం కోల్పోయి కట్టు బట్టలతో మిగిలారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ ఇంఛార్జి డేగల రామచంద్రరావు ఆధ్వర్యంలో శుక్రవారం బాధితులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, కూరగాయలు, రూ. 4 వేల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇస్లావత్ వినోద్ కుమార్, దామర అయ్యప్ప , మంగదొడ్డి సాయి, బద్దిరెడ్డి రాజేష్, మౌళి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News