Friday, March 21, 2025

నిమిషానికి రూ. కోటికి పైగా అప్పులు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రోజుకు రూ.1700 కోట్లకు పైగా కాంగ్రెస్ సర్కార్ అప్పు చేస్తోందని బిజెపి పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అప్పు రూ. 8.6 లక్షల కోట్లు ఉందన్నారు. బడ్జెట్ పై శాసన సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమిషానికి రూ. కోటికి పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని చెప్పారు. కులగణన సర్వేలో రాష్ట్ర జనాభా 3.54 కోట్లు తేలిందని, రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రుణభారం రూ.2.27 లక్షలుగా ఉందని తెలియజేశారు. పెద్ద ఎత్తున రుణాలుంటే తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పాలని ప్రశ్నించారు.

యూపిఎ కంటే ఎన్డియే హయాంలో ఆర్థిక సంఘం నిధులు పెరిగాయన్నారు. యూపిఎ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో 32 శాతం వాటా ఉండేదని, యూపిఎ హయాంలో కేంద్ర పన్నుల్లో వాటా 2-3 శాతం కూడా పెంచలేదని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక కేంద్ర పన్నుల్లో 10 శాతం పెంచి 42 శాతం చేశారని పేర్కొన్నారు. పన్నుల్లో వాటా పెంచాక కూడా కేంద్రాన్ని విమర్శించడం సరికాదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News