Thursday, April 17, 2025

తిరుమలలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 14 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుంది. ఇక, మంగళవారం శ్రీవారిని 67,209 మంది భక్తులు దర్శించుకుని ముక్కులు తీర్చుకున్నారు. 22,708 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టిటిడి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News