Wednesday, April 16, 2025

తిరుమలలో భక్తుల రద్దీ.. 13 కంపార్టుమెంట్లు ఫుల్

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో భక్తులకు స్వామివారి సర్వదర్శనం కోసం 18 గంటల నుంచి 20 గంటల వరకు సమయం పడుతుంది.

ఇక, మంగళవారం తిరుమల వెంకన్నను 73,543 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,346 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.422 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News