- Advertisement -
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం వీకెండ్ కావడంతో తిరుమల వెంకన్న దర్శనకోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది.ఇక, శుక్రవారం తిరుమల వెంకన్నను 64,536 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 30,612 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.37 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -