Thursday, April 24, 2025

తిరుమలలో భక్తుల రద్దీ…

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామివారి సర్వదర్శం కోసం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

కాగా, మంగళవారం శ్రీవారిని 76,254 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో నిన్న 28,091 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.9 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News