Saturday, February 1, 2025

శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం..

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో వైకుంఠ క్యూకాంప్లెక్సులన్ని భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

కాగా, శనివారం శ్రీవారిని 82,999 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో నిన్న 38,875 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News