Sunday, September 8, 2024

శ్రీశైలానికి పోటెత్తిన వరద

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎగువ నుంచి శ్రీ శైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరుగుతూ వస్తోంది. గురువారం సాయంత్రం రిజర్వాయర్‌లోకి 2.54లక్షల క్యూస్కెల వరదనీరు చేరుతుండగా, ప్రాజెక్టులో నీటినిలువ 92టిఎంసీలకు పెరిగింది.రిజర్వాయర్‌లో నీటిమట్టం సా యంత్రానికే 855అడుగులకు చేరుకుంది. ఎగువన మహారాష్ట్ర ,కర్ణాటకలో కురుస్తున్న వర్షాల తో ఆల్మట్టి ప్రాజెక్టులోకి 1.988లక్షల క్యూసెక్కు ల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 2.75లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యాం నుంచి 2.50లక్ష ల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎ గువ నుంచి జూరాలకు 2.27లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 2.50లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నా రు. మరో వైపు తుంగభధ్ర ప్రాజెక్టుకూ కూడా భా రీగా వదర ప్రవాహం వస్తోంది. ఎగువ నుంచి 98450 క్యూసెక్కుల నీరు చేరుతుండగా ప్రాజె క్టు నుంచి 98404క్యూసెక్కులు బయటకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిలు వ సామర్దం 105టిఎంసీలు కాగా, గురువారం సాయంత్రానికి 100టిఎంసీలకు చేరుకుంది.

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. నదిలో నీటిమట్టం 48అడుగులు ఉండగా , రెం డవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నదిలో 10.11లక్షల క్యూసెక్కువ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువనుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 21650క్యూసెక్కుల నీరు చేరుతోంది.కడెం ప్రాజెక్టులోకి 10536క్యూసెక్కుల నీరు చేరుతుండగా ,ప్రాజెక్టు నుంచి 13082క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 20998క్యూసెక్కుల నీరు చేరుతోంది.
ప్రాణహితకు తగ్గిన వరద:
గోదావరికి ప్రధాన ఉపనదిగా ఉన్న ప్రాణహితకు వరద స్వల్పంగా తగ్గింది. గురువారం ప్రాణహి త నుంచి మేడిగడ్డ బ్యారేజికి 7.71లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా ,వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదులు తున్నారు.దుమ్ముగూడెం వద్ద గోదావరిలో నీటి ప్రవాహం 11. 47లక్షల క్యూసెక్కులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News