Tuesday, September 17, 2024

నిండుకుండలా శ్రీశైలం జలాశయం..

- Advertisement -
- Advertisement -

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంటోంది. భారీ వరదతో జలాశయం నిండుకుండలా మారింది. దీంతో మరోసారి గేట్లు ఎత్తి దిగువకు నిటీని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 2.13 లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ఫ్లో 1.02 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

మరోవైపు, జూరాల జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.18 లక్షల క్యూసెక్కులు కాగా, 45 గేట్లను ఎత్తి 2.13 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News