Friday, April 25, 2025

ఆందోల్ లో భార్యను చంపి… ఉరేసుకున్న భర్త

- Advertisement -
- Advertisement -

ఆందోల్: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం నాదులాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్యను భర్త చంపి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. దంపతులు నారాయణ, మల్లమ్మ మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. మల్లమ్మను చంపిన అనంతరం భర్త నారాయణ ఉరేసుకున్నాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆందోల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News