- Advertisement -
భార్యపై అనుమానం పెనుభూతంగా మారి హత్యకు దారి తీసింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలం, మాదిమాణిక్యంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పూజల నరసకుమారి (30)కి అదే గ్రామానికి చెందిన బాల సైదులుతో వివాహం జరిగింది. సైదులు భార్యపై అనుమానం పెంచుకొని మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -