Thursday, April 17, 2025

అత్యాచారం చేసి భార్యను హతమార్చిన భర్త

- Advertisement -
- Advertisement -

భార్యను భర్త హతమార్చిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. భైంసా మండలంలోని దేగాంకు చెందిన సురేఖ, రమేశ్‌ దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. తాగుడికి బానిసైన రమేశ్‌ తరచూ డబ్బుల కోసం భార్యతో గొడవపడుతూ హింసించేవాడు. రమేశ్‌ గురువారం మధ్యాహ్నం తాగి వచ్చి భార్యతో గొడవపడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె మెడలోని నల్లపూసల తాడుతో ఉరిబిగించి చంపాడు. ఈ విషయం పై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News