Friday, July 5, 2024

అదనపు కట్నం తీసుకరావడంలేదని ఒళ్లంతా కొరికాడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: భార్య అదనపు కట్నం తీసుకరావడంలేదని ఒళ్లంతా భర్త కొరికేయడంతో అతడిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని పెనమలూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గుంటూరు జిల్లాకు చెందిన షేక్ మహ్మద్ రఫీ ఫైనాన్సియల్ కంపెనీలో రికవరీ ఏజెంటుగా పని చేస్తున్నాడు. గత సంవత్సరం సనత్‌నగర్‌కు చెందిన షేక్ ముస్కాన్‌ను రఫీ పెళ్లి చేసుకున్నాడు.

గత ఆరు నెలల నుంచి అదనపు కట్నం తీసుకరావాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. అందం, చదువు ఏమీ లేదని, అదనపు కట్నం కావాలని భార్యపై పలుమార్లు దాడి చేయడంతో పాటు ఒళ్లంతా భర్త కొరికాడు. అతడి వేధింపులు శృతి మించడంతో తన పుట్టింటికి వెళ్లి కుటుంబ సభ్యులకు తెలిపింది. తన పుట్టింటి వారితో కలిసి శృతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో భర్త రఫీ, అత్త గౌషియా, ఆడపడుచు తస్లిమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News