Saturday, February 22, 2025

జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద మంగళవారం అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి కృష్ణానగర్ వైపునకు వెళ్లే మార్గంలో కారు అదుపు తప్పి ఫుట్ పాత్ పైనుంచి చెట్లను ఢీకొని అనంతరం టెలిఫోన్ స్తంభం పైకి ఎక్కి కారు అమాంతంగా కిందపడింది. కారులో ఉన్న ఇద్దరు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో బిటెక్ విద్యార్థి సాకేత్ రెడ్డి తన మిత్రుడితో కలిసి కారును డ్రైవింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News