Sunday, September 8, 2024

సోమ, మంగళవారం జాగ్రత్త… ఎల్లో అలర్ట్ జారీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ….

హైదరబాద్: తెలంగాణ రాష్ట్రంలో సోమవారం, మంగళవారం ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రాత్రి సమయంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. పలుచోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎండలు ఎక్కువగా ఉండడంతో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రయాణం చేయకపోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎమర్జెన్సీ పని ఉంటే తప్పితే బయటకు వెళ్లొద్దని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News