Monday, July 1, 2024

హైదరాబాద్ టార్గెట్ 215

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు ముందు పంజాబ్ 215 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్లు అథర్వ టైడ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రీలే రోసో దూకుడుగా ఆడారు. తొలి వికెట్‌పై సింగ్, టైడ్ ఇద్దరు 97 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. పంజాబ్ బ్యాట్స్‌మెనలలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్(71), అథర్వ టైడ్(46), రీలే రోసో(49), జీతేశ్ శర్మ(32 నాటౌట్), శషాంక్ సింగ్(02), అసుతోష్ శర్మ(02), శివమ్ సింగ్(2 నాటౌట్), పరుగులు చేసి ఔటయ్యారు. హైదరాబాద్ సన్ రైజర్స్ బౌలర్లలో టి నటరాజన్ రెండు వికెట్లు తీయగా, ప్యాట్ కమ్నీస్, విజయకాంత్ తలో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News