Wednesday, September 18, 2024

నల్ల చెరువు కబ్జాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

- Advertisement -
- Advertisement -

ఉప్పల్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం ఉప్పల్ నల్లచెరువును పరిశీలించారు. అప్పుడు ఆయనతో పాటు ఎంఎల్ సి  తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, వజ్రేశ్ యాదవ్, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ నల్ల చెరువులో కబ్జాలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. చెరువులు, నాలాలు, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ఆక్రమణలను తొలగించడానికి హైడ్రా పనిచేస్తోందని రంగనాథ్ అన్నారు. కబ్జాలను ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News