Thursday, September 19, 2024

ప్రజా శ్రేయస్సు కోసమే హైడ్రా: దానం నాగేందర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజా శ్రేయస్సు కోసమే హైడ్రాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారని ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ తెలిపారు. సోమవారం దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. అన్యాక్రాంతమైన భూములను హైడ్రా స్వాధీనం చేసుకుంటుందని, మూడు సార్లు ఎంఎల్‌ఎగా గెలిచిన ప్రజాప్రతినిధిని నాన్‌లోకల్ అనడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఎపి, తెలంగాణ అంటూ విభేదాలు సృష్టిస్తే చర్యలు తప్పవని దానం హెచ్చరించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News