Friday, September 20, 2024

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2022కు వాయిదా!

- Advertisement -
- Advertisement -

T20 World Cup 2020

 

మహమ్మారి కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఆస్ట్రేలియాలో అక్టోబర్-నవంబర్ లో జ‌ర‌గాల్సిన ఐసిసి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2022కు వాయిదా ప‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. కానీ, ఈ యేడాది జరగాల్సిన మెగా టోర్నీని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించాలని అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి భావించిందని.. అయితే, 2021లో టీ20 వరల్డ్ కప్ ఇండియాలో తధావిధంగా జరగనున్న నేపథ్యంలో 2022కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.ఇదిలావుంటే, టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై చర్చించేందుకు గురువారం ఐసీసీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో టోర్నీ నిర్వహణపై తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు.

కాగా, కరోనా కారణంగా అంతర్జాతీయ మ్యాచ్ లతోపాటు ఈ యేడాది జరగాల్సిన ఐపిల్ 13వ సీజన్ ను కూడా బిసిసి వాయిదా వేసింది. ఐపిల్ నిర్వహించాలా లేదా అనే అంశంపై బిసిసిఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా విజృంభణతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్రీడా టోర్నీలు ర‌ద్దైయ్యాయి. ఇక, ఈ ఏడాది టోక్యోలో జ‌ర‌గాల్సిన ఒలింపిక్స్‌ కూడా వాయిదా పడిన విష‌యం తెలిసిందే.

ICC Set to Postpone T20 World Cup 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News